'ఈ నగరానికి ఏమైంది' రిపీట్!

మొదటి సినిమా 'పెళ్లి చూపులు'తోనే టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తీసిన మరో చిత్రం 'ఈ నగరానికి ఏమైంది' యూత్ లో మంచి పేరు తెచ్చుకుంది. విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను వంటి నటులతో వచ్చిన ఈ చిత్రం ఓ కల్ట్ మూవీగా మారింది.
మొదటిసారి థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా కలెక్షన్లు రాకపోయినా.. ఓటీటీలో మాత్రం ఈ మూవీకి భారీ క్రేజ్ వచ్చింది. రీ-రిలీజ్ లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'ఈ నగరానికి ఏమైంది రిపీట్'ను తీర్చిదిద్దుతున్నాడు తరుణ్ భాస్కర్.
లేటెస్ట్ గా 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' మోషన్ పోస్టర్ రిలీజయ్యింది. 'ఏలినాటి శని అయిపోయింది. కన్యారాశి టైమ్ వచ్చింది..' అంటూ హీరోల పేర్లతో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
-
Home
-
Menu