క్లైమాక్స్ మార్పుపై ధనుష్ ఆవేదన

ధనుష్, సోనమ్ కపూర్ జంటగా, ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందిన ‘రాంఝానా’ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ వెర్షన్ కి క్లైమాక్స్ లో మార్పులు చేశారు.
AI టెక్నాలజీ సహాయంతో ఒరిజినల్ వెర్షన్లో హీరో మరణించే ఎమోషనల్ ఎండ్ను తొలగించి, హ్యాపీ ఎండింగ్ జతచేశారు. ఈ మార్పులపై ధనుష్ తీవ్రంగా స్పందించాడు. 'AIతో రూపొందించిన క్లైమాక్స్ సినిమా ఆత్మను చంపేసింది. మేము అభ్యంతరం తెలిపినా, మా అనుమతి లేకుండానే ఈ మార్పులు చేశారు. ఇది నేను 12 ఏళ్ల క్రితం కమిట్ అయిన సినిమా కాదు. ఈ విధంగా సినిమాల కంటెంట్ను మార్చడం కళ, కళాకారుల్ని బాధించే పని. ఇలాంటి పద్ధతులను నిరోధించేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలి' అని తన పోస్ట్లో తెలిపాడు ధనుష్.
For the love of cinema 🙏 pic.twitter.com/VfwxMAdfoM
— Dhanush (@dhanushkraja) August 3, 2025
-
Home
-
Menu