క్రెడిట్ కోసం కొరియోగ్రాఫర్ ఆవేదన

సినిమా అనేది సామూహిక కృషితో ముందుకు సాగే కళా రూపం. తెరపై మెరవడానికి, తెర వెనక వేల మంది మేధావులు, కార్మికులు నిరంతరం శ్రమిస్తుంటారు. కానీ, తెరపై కనిపించే తారలకే ఎక్కువగా గుర్తింపు దక్కుతూ ఉంటుంది. లేటెస్ట్ గా కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ వ్యక్తపరిచిన వ్యాఖ్యలు ఈ వాస్తవాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.
‘దేవర’లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై చిత్రీకరించిన ‘చుట్టమల్లే’ పాటకు బాస్కో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఈ పాటకు విశేషమైన స్పందన లభించింది. అయితే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినా, తన కృషిని ఎవరూ ప్రస్తావించకపోవడంపై బాస్కో ఎమోషనల్ అయ్యాడు.
సినిమా ప్రమోషన్ సమయంలో జాన్వీ తన పేరు ఒక్కసారి అయినా ప్రస్తావించి ఉండవలసిందని భావించినట్లు ఆయన ఓ ఇంటర్యూలో తెలిపాడు. అలాగే ‘ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదని అడగలేను. కానీ ఒక్క మాట చెప్పి ఉంటే ఆనందంగా ఉండేది‘ అన్న బాస్కో మార్టిస్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
మరోవైపు బాస్కో లాంటి ప్రతిభావంతులు గుర్తింపు కోసం కంగారు పడాల్సిన రోజులు పోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని, తెర వెనక కళాకారులు కూడా బాగానే ఫేమస్ అవుతున్నారు. అసలు ‘చుట్టమల్లే‘ పాట చిత్రీకరణకు ముందే బాస్కో ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడనే వార్తలు ఎన్నో వచ్చాయి. అదే విషయాన్ని తారక్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
-
Home
-
Menu