32 ఏళ్ళ తర్వాత ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్

‘36 ఫామ్హౌస్’ తర్వాత సీనియర్ ఫిల్మ్మేకర్ సుభాష్ ఘాయ్ మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు. ఆయన ఫిల్మోగ్రఫీలో రామ్ లఖన్, సౌదాగర్, కర్మ, పరదేశ్ వంటి క్లాసిక్ హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన కెరీర్లోని అత్యంత ఐకానిక్ సినిమాల్లో ఒకటైన ‘ఖల్ నాయక్’ సీక్వెల్కి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్.
తాజా సమాచారం ప్రకారం.. సుభాష్ ఘాయ్ ‘ఖల్ నాయక్’ సీక్వెల్ని తెరకెక్కించడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. కొత్త పాత్రలతో, కొత్త నటులతో ఈ కథ సాగుతుంది. అయితే, అసలైన ఆకర్షణను జోడించేందుకు మాధురీ దీక్షిత్, సంజయ్ దత్లను ప్రత్యేక పాత్రల కోసం తీసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. 1993లో వచ్చిన ‘ఖల్ నాయక్’ సినిమా సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ ఫేస్-ఆఫ్తో, మాధురీ దీక్షిత్ లీడ్ రోల్లో సూపర్ హిట్ అయింది. "చోలీ కే పీఛే" పాట గత మూడు దశాబ్దాలుగా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. అంతే కాదు, ఖల్ నాయక్ ఈ రోజుకీ సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సుభాష్ ఘాయ్ కెరీర్లోని బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది.
ఈ ప్రాజెక్ట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే.. సుభాష్ ఘాయ్ సులభమైన రీమేక్ మార్గాన్ని ఎంచుకోకుండా సీక్వెల్ని రూపొందించాలని నిర్ణయించారు. కొత్త నటులు కథకు తాజాదనాన్ని తీసుకొస్తారు, అదే సమయంలో మాధురీ, సంజయ్ నాస్టాల్జియా వాల్యూ జోడిస్తారు. సుభాష్ ఘాయ్ని ఒకప్పుడు 'షోమాన్' అని పిలిచేవారు, మరియు ఈ ప్యాషన్ ప్రాజెక్ట్ ఆయన ఫిల్మ్మేకర్, కథకుడిగా ఉన్న లెగసీకి తగ్గట్టుగా ఉంటుందని స్పష్టం. దీనిపై అధికారిక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
-
Home
-
Menu