రష్మిక మరో బాలీవుడ్ చిత్రం !

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల తన కాలు గాయపడడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. ఈ కారణంగా ఆమె నటిస్తున్న హైప్రొఫైల్ సినిమాలైన ధనుష్ "కుబేర", సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న "సికిందర్" చిత్రాల షూటింగ్స్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇక మరోవైపు రష్మిక మరో భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్లో నటించే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రానికి రష్మిక మందన్నను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇది సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న మల్టీ-స్టారర్ సినిమా. ఆసక్తికరంగా.. రష్మిక ఇప్పటికే "సికిందర్" చిత్రంలో సల్మాన్తో కలిసి నటిస్తుండగా.. మరోసారి అతడితో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం ప్రత్యేకంగా మారింది.
ఈ ప్రాజెక్ట్లో రజినీకాంత్ లేదా కమల్ హాసన్ కూడా నటించే అవకాశముందని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అట్లీ గత ఏడాది షారుక్ ఖాన్తో "జవాన్" సినిమాను రూపొందించి సంచలన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు.. తన ఆరో సినిమాగా సల్మాన్ ఖాన్తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్.
రష్మిక బాలీవుడ్లో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. "పుష్ప" ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. రణబీర్ కపూర్తో కలిసి నటించిన "యానిమల్" బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించడంతో, ఆమెకు అక్కడ భారీ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక, "పుష్ప 2" రాబోతుండటంతో ఆమె స్టార్డమ్ మరింత బలపడనుంది. ఈ మల్టీ-స్టారర్ చిత్రంపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
-
Home
-
Menu