దర్శకుడిగా మారబోతున్న రణ్ బీర్ కపూర్

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్ ఇప్పుడు కొత్త ఛాలెంజ్ తీసుకుంటున్నాడు. ‘యానిమల్, రాక్స్టార్’ లాంటి బ్లాక్బస్టర్స్, రొమాన్స్ నుంచి యాక్షన్ వరకు 15 ఏళ్లకు పైగా సినిమాల్లో దుమ్ము రేపిన తర్వాత, ఇప్పుడు ఆయన డైరెక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
రీసెంట్గా జరిగిన ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో.. ఫ్యూచర్ ప్రాజెక్ట్ల కోసం స్టోరీ ఐడియాలు డెవలప్ చేయడానికి ఒక రైటింగ్ వర్క్షాప్ స్టార్ట్ చేసినట్టు చెప్పాడు. అంటే డైరెక్షన్ మీద ఆయనకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతోంది. అసలు ఆయన స్టార్ నటుడు కాకముందే, ‘ప్రేమ్ గ్రంథ్, ఆ అబ్ లౌట్ చలేన్, బ్లాక్’ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విషయం తెలిసిందే.
రణ్బీర్ ఎప్పుడూ కొత్త రోల్స్ చేస్తూ, తన లిమిట్స్ పెంచుకుంటూ వచ్చాడు. 2007లో ‘సావరియా’ తో ఎంట్రీ ఇచ్చి, ‘యానిమల్’ లాంటి కల్ట్ హిట్తో ఇండియాలోనే మోస్ట్ వెర్సటైల్ యాక్టర్లలో ఒకడిగా ఎదిగాడు. ఇప్పుడు, కెమెరా వెనక్కి మారిన ఫర్హాన్ అక్తర్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, ఆర్. మాధవన్ లాంటి స్టార్స్ లిస్ట్లో చేరాడు. ఆయన నటనా అనుభవం డైరెక్షన్కి ఎలా యూజ్ అవుతుందో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
తన మొదటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ పూర్తిగా చెప్పకపోయినా, ఈ వర్క్షాప్లో వచ్చే ఐడియాలతోనే నెక్స్ట్ రెండేళ్లలో సినిమాలు చేస్తానని చెప్పాడు. ఈ వర్క్షాప్ తన సొంత స్టైల్లో కథలు రాసుకోవడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే, ఆయన డైరెక్షన్ డెబ్యూట్ కూడా తన నటనలో ఉన్న లోతైన ఫీలింగ్స్ని, క్రియేటివిటీని మిక్స్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది.
అదే టైమ్లో, 2027లో షూటింగ్ స్టార్ట్ కానున్న యానిమల్ సీక్వెల్ 'యానిమల్ పార్క్' కోసం కూడా రణ్బీర్ రెడీ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న ఆ సినిమా 'చాలా క్రేజీగా' ఉంటుందని, ఫ్యాన్స్కు మరో హై-ఎనర్జీ పర్ఫామెన్స్ గ్యారంటీ అని చెప్పాడు. యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్... ఇలా అన్నిటినీ బాలెన్స్ చేస్తూ, రణ్బీర్ ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంటున్నాడు. ఫిల్మ్ మేకింగ్లో ప్రతి యాస్పెక్ట్ను ఎక్స్ప్లోర్ చేస్తేనే బాలీవుడ్లో ఎదుగుదల ఉంటుందని ఇది ప్రూవ్ చేస్తోంది.
-
Home
-
Menu