క్రేజీ సీక్వెల్ లో హీరోగా రణబీర్ కపూర్ ?

క్రేజీ సీక్వెల్ లో హీరోగా రణబీర్ కపూర్ ?
X
2013లో విడుదలైన ‘ధూమ్ 3’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు 12 సంవత్సరాల విరామం తరువాత ‘ధూమ్ 4’తో ఈ సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ మీడియా నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

బాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాతగా పేరుగాంచిన అదిత్య చోప్రా, యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ‘ధూమ్’ ఫ్రాంచైజ్‌ను మరోసారి గ్రాండ్‌గా తీసుకొస్తున్నారు. 2004లో మొదలైన ఈ యాక్షన్-థ్రిల్లర్ సిరీస్, భారతీయ సినిమా పరిశ్రమలో ఒక ఐకానిక్ ఫ్రాంచైజ్‌గా నిలిచింది. 2013లో విడుదలైన ‘ధూమ్ 3’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు 12 సంవత్సరాల విరామం తరువాత ‘ధూమ్ 4’తో ఈ సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ మీడియా నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

అదిత్య చోప్రా, ప్రముఖ రచయిత శ్రీధర్ రాఘవన్‌తో కలిసి ‘ధూమ్ 4’ స్క్రిప్ట్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా కథనం, హై-ఆక్టేన్ యాక్షన్, స్టైలిష్ ప్రజెంటేషన్, థ్రిల్లింగ్ చేజ్ సీన్స్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది.

ఏప్రిల్ 2026 నుండి షూటింగ్ పనులు మొదలవుతాయి. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ‘ధూమ్ 4’ దర్శకత్వ బాధ్యతలను ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసుకోనున్నారని సమాచారం. అయాన్ ముఖర్జీ, గతంలో ‘వేక్ అప్ సిడ్’, ‘యే జవానీ హై దీవానీ’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు. ప్రస్తుతం యన్టీఆర్, హృతిక్ రోషన్ తో ‘వార్ 2’ ను తెరకెక్కిస్తున్నాడు. అలాంటి అయాన్ దర్శకత్వంలో ‘ధూమ్ 4’ సినిమా సిరీస్‌కు కొత్త ఒరవడిని తీసుకొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

రణబీర్ కపూర్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘రామాయణ’, ‘లవ్ అండ్ వార్’ సినిమాల షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నాడు. ‘రామాయణ’ సినిమా, నితేష్ తివారీ దర్శకత్వంలో ఒక గ్రాండ్ మైథలాజికల్ డ్రామాగా రూపొందుతోంది, ఇందులో రణబీర్ శ్రీ రాముడి పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు, ‘లవ్ అండ్ వార్’ సినిమా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఒక ఎమోషనల్ డ్రామా. ఇందులో రణబీర్‌తో పాటు ఆలియా భట్, విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల షూటింగ్‌ను 2026లో పూర్తి చేసిన తర్వాత, రణబీర్ ‘ధూమ్ 4’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు.

Tags

Next Story