తన కామెంట్ కు క్లారిటీ ఇచ్చిన కాజోల్

తన కామెంట్ కు క్లారిటీ ఇచ్చిన కాజోల్
X
తన కామెంట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారని, అది తన లేటెస్ట్ మూవీ ‘మా’ మూవీ ప్రమోషన్ కోసం చేసిన స్టేట్‌మెంట్‌లో భాగమని క్లారిటీ ఇచ్చింది.

బాలీవుడ్ నటీమణి కాజోల్ ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చేసిన ఒక కామెంట్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆమె రామోజీ ఫిల్మ్ సిటీని "ఎప్పుడూ కాస్త భయంకరంగా అనిపించేది" అని అనడం రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్‌మెంట్‌కి, సినీ లవర్స్‌కి అస్సలు రుచించలేదు. ఎందుకంటే, రామోజీ ఫిల్మ్ సిటీ అంటే భారతదేశంలోనే టాప్ ఫిల్మ్ షూటింగ్ హబ్‌లలో ఒకటి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు రోజూ ఇక్కడ షూటింగ్‌లతో బిజీగా ఉంటాయి. ఇంత హడావిడి ఉండే ప్లేస్‌ని భయంకరమంటే ఎవరికైనా కొంచెం కోపం రాకుండా ఉంటుందా?

ఇక కాజోల్ భర్త, బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా తన హిందీ సినిమాలను రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్‌గా షూట్ చేస్తుంటాడు. అలాంటిది కాజోల్ ఇలాంటి కామెంట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంతేకాదు, గతంలో ఇతర సెలబ్రిటీలు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో తాము ఎదుర్కొన్న కొన్ని వింత అనుభవాల గురించి చెప్పిన పాత ఇంటర్వ్యూలు, వీడియోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాజోల్ కామెంట్‌కి మరింత హైప్ ఏర్పడింది.

ఈ వివాదం ఇంకా ఎక్కడికో వెళ్తుందని అనుకుంటున్న సమయంలో, కాజోల్ సోమవారం ఎక్స్ లో ఒక పోస్ట్ చేసి ఈ గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తన కామెంట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారని, అది తన లేటెస్ట్ మూవీ ‘మా’ మూవీ ప్రమోషన్ కోసం చేసిన స్టేట్‌మెంట్‌లో భాగమని క్లారిటీ ఇచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీపై తనకు ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ లేవని, అక్కడ తన అనుభవాలు ఎప్పుడూ సూపర్‌బ్‌గా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

Tags

Next Story