ఆస్కార్ అకాడమీ నుంచి కమల్, ఆయుష్మాన్ కు పిలుపు

ప్రపంచ సినీ రంగంలో అత్యంత గౌరవనీయమైన ఆస్కార్ అకాడమీలో భారతీయ సినీ ప్రముఖులకు అరుదైన గౌరవం దక్కింది. లెజెండరీ నటుడు కమల్ హాసన్, బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ఆయుష్మాన్ ఖురానా, టాలెంటెడ్ డైరెక్టర్ పాయల్ కపాడియా, అలాగే మాక్సిమా బసు, రణ్వీర్ దాస్, కరణ్ మాలి, స్మృతి ముంద్రా వంటి భారతీయ సినీ టాలెంట్ ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’లో సభ్యులుగా ఆహ్వానం పొందారు.
తాజాగా అకాడమీ విడుదల చేసిన లిస్ట్ ప్రకారం, 2025 సంవత్సరంలో మొత్తం 534 మంది కొత్త సభ్యులను ఎంపిక చేశారు. ఈ లిస్ట్లో స్పెషల్ హైలైట్ ఏంటంటే, 41 శాతం మంది మహిళలు ఉండటం. ఈ కొత్త సభ్యులందరూ ఆస్కార్ అవార్డుల ప్రక్రియలో కీలకమైన ఓటింగ్లో భాగం కానున్నారు. నామినేషన్ స్టేజ్ నుంచి ఫైనల్ విజేతలను ప్రకటించే వరకు, వీరి ఓటింగ్ సినిమా ప్రపంచంలో బెస్ట్ టాలెంట్ను గుర్తించడంలో క్రిటికల్ రోల్ పోషిస్తుంది.
ఈ ఘనత భారతీయ సినిమా ఇండస్ట్రీకి గ్లోబల్ రీచ్ను, గుర్తింపును మరింత పెంచడమే కాకుండా, ఆస్కార్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై భారతీయ సినీ ప్రతినిధుల పాత్రను స్ట్రాంగ్ చేస్తోంది. కమల్ హాసన్ వంటి లెజెండ్ నుంచి ఆయుష్మాన్ ఖురానా, పాయల్ కపాడియా వంటి యంగ్ టాలెంట్ వరకు, ఈ ఎంపిక భారతీయ సినిమా యొక్క వైవిధ్యాన్ని, డెప్త్ను ప్రపంచానికి చాటిచెబుతోంది.
-
Home
-
Menu