మే 20న అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ?

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లు కలసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసు కుంటుండటంతో, ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హృతిక్ రోషన్ తన సహనటుడు ఎన్టీఆర్కు ఒక ఆసక్తికరమైన మెసేజ్ పంపుతూ సోషల్మీడియా వేదికగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు.
"హాయ్ తారక్ .. ఈ సంవత్సరం మే 20న ప్రత్యేకత ఏంటో నీకు తెలుసా? సిద్ధంగా ఉండు.. ఊహించలేని గిఫ్ట్ ఉంటుంది.." అంటూ ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు కావడం, అదే రోజు హృతిక్ ప్రత్యేక గిఫ్ట్ అంటూ చెప్పడంవల్ల.. ‘వార్ 2’ టీజర్ మే 20న విడుదల కాబోతోందని అభిమానులు ఊహిస్తున్నారు. 2019లో సూపర్ హిట్గా నిలిచిన ‘వార్’ సినిమాకు ఇది సీక్వెల్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నాడు. కథను అంతర్జాతీయ స్థాయిలో మలచినట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, ఆమె పాత్రలోనూ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆగష్టు 14న విడుదలకు సిద్ధమవుతున్న ‘వార్ 2’ లో ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్రలో కనిపించ నున్నారని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ లాంటి స్టార్లు రా ఏజెంట్లుగా కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఎన్టీఆర్ పాత్ర మాత్రం వాటి కంటే భిన్నంగా ఉంటుందని సమాచారం.
Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2
— Hrithik Roshan (@iHrithik) May 16, 2025
-
Home
-
Menu