‘మహాభారతం’ బహుశా నా ఆఖరి ప్రాజెక్ట్ కావచ్చు : ఆమిర్ ఖాన్

బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ తన రాబోయే చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇది ‘తారే జమీన్ పర్’ మూవీకి సీక్వెల్గా రూపొందిన స్పోర్ట్స్ కామెడీ-డ్రామా. ఈ సినిమా జూన్ 20 న థియేటర్లలో విడుదల కానుంది. ఆమిర్ ఖాన్తో పాటు జెనీలియా దేశ్ముఖ్ నటిస్తున్న ఈ చిత్రంలో మరికొందరు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఆమిర్ తన చివరి సినిమాగా భావిస్తున్న ‘మహాభారతం’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘సితారే జమీన్ పర్’ విడుదల తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ మొదలవుతుందని తెలిపారు. మహాభారతాన్ని తన “డ్రీమ్ ప్రాజెక్ట్” అని పిలిచిన ఆమిర్, “ఈ కథ చాలా సంక్లిష్టమైనది, భావోద్వేగమైనది, విశాలమైనది, అద్భుతమైనది. ‘మహాభారతం’ ఈ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని కలిగి ఉంది...” అని అన్నారు.
59 ఏళ్ల ఈ నటుడు, నిర్మాత, ‘మహాభారతం’ గాఢత, సంక్లిష్టత తనకు అపూర్వమైన కళాత్మక తృప్తిని ఇస్తుందని, దాని తర్వాత మరిన్ని కథలు చెప్పాలనే కోరిక ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. “మహాభారతం పూర్తయ్యాక, బహుశా నాకు ఇంకేమీ చేయాలనిపించకపోవచ్చు. ఇప్పటికి నాకు ఖచ్చితంగా తెలియదు,” అని ఆయన ఈ ప్రాజెక్ట్ యొక్క భావోద్వేగ ప్రభావం గురించి ఆలోచిస్తూ చెప్పారు.
-
Home
-
Menu