మహా కుంభమేళలో పాల్గొన్న మరో బాలీవుడ్ బ్యూటీ !

మహా కుంభమేళలో పాల్గొన్న మరో బాలీవుడ్ బ్యూటీ !ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళ 2025కు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ హాజరైంది. ఆమెతో పాటు ఆమె అత్త వీనా కౌశల్ కూడా ఈ పుణ్యస్నాన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ మహా కుంభ్లో పాల్గొనడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని కత్రినా తెలిపింది. నేడు కత్రినా పరమార్థ నికేతన్ను సందర్శించి, ఆధ్యాత్మిక గురువులు స్వామి చిదానంద సరస్వతి, సాధ్వీ భాగవతి సరస్వతి వద్ద ఆశీర్వాదాలు తీసుకుంది.
ఈ సందర్భంగా ఆమె అందమైన పింక్ రంగు చీరధరించి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె అత్త వీనా కౌశల్ కూడా నీలం రంగు దుస్తుల్లో సంప్రదాయబద్ధంగా మెరిశారు. ఈ పర్యటన కత్రినా, ఆమె అత్త మధ్య ఒక ప్రత్యేక అనుబంధాన్ని ప్రతిబింబించింది. మహా కుంభమేళ పవిత్ర వాతావరణంలో వీరిద్దరూ ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించారు.
ఈ సందర్భంగా.. కత్రినా కైఫ్.. మాట్లాడుతూ "ఈసారి ఇక్కడికి రావడం నాకు గొప్ప అదృష్టంగా అనిపిస్తోంది. నేను ఎంతో ఆనందంగా.. ఉన్నాను. స్వామి చిదానంద సరస్వతిని కలుసుకొని ఆశీర్వాదాలు పొందాను. ఇక్కడి శక్తి, అందం, గంభీరత నాకు ఎంతో నచ్చాయి. నేను ఇక్కడ మరికొంత సమయం గడపాలని కోరుకుంటున్నాను" అని పేర్కొంది. మహా కుంభమేళ 2025 జనవరి 13న ప్రారంభమై.. ఫిబ్రవరి 26 వరకు ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతోంది. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి తమ ఆధ్యాత్మిక మార్గాన్ని సంప్రాప్తించారు. గంగా, యమునా, ఆదిశక్తి సరస్వతి నదుల సంగమంలో స్నానం చేసి మోక్షాన్ని కోరుకుంటున్నారు.
బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, క్రిస్ మార్టిన్ సహా అనేక మంది ప్రముఖులు ఈ మహా కుంభ్లో పాల్గొన్నారు. ఇటీవల కత్రినా భర్త విక్కీ కౌశల్ తన చిత్రం "ఛావా" ప్రమోషన్లో భాగంగా మహా కుంభమేళను సందర్శించారు. ఈ మేళాకు హాజరైన ఇతర సినీ ప్రముఖుల్లో ఈషా గుప్తా, విజయ్ దేవరకొండ, హేమ మాలినిలాంటి నటీనటుల పేర్లు కూడా ఉన్నాయి.
-
Home
-
Menu