ABN పై దాడి చేస్తే ఊరుకోం – అరగంటలోనే బదులు!
BRS దాడులు చేస్తే, తెలంగాణ భవన్పై యుద్ధమే!" – బండి సంజయ్ హెచ్చరిక;
By : Dasari Suresh
Update: 2025-07-07 12:25 GMT
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ –"ABN ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై BRS నేతలు దాడులకు పాల్పడితే, మేమూ చూస్తూ ఊరుకోం. అరగంటలోనే బీజేపీ యువమోర్చా శ్రేణులు తెలంగాణ భవన్పై దాడికి దిగుతాయి. ఇది మా స్పష్టమైన హెచ్చరిక. దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. ఈ విషయాన్ని మా అధ్యక్షుడు రామచందర్ రావుగారికి కూడా తెలియజేశాం" అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.