'కన్నప్ప' కోసం ప్రభాస్ వస్తాడా?
'కుబేర' తర్వాత ఇప్పుడు అందరి దృష్టి 'కన్నప్ప'పైనే. జూన్ 27న పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వస్తుంది.;
'కుబేర' తర్వాత ఇప్పుడు అందరి దృష్టి 'కన్నప్ప'పైనే. జూన్ 27న పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వస్తుంది.భారీ డివోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో విష్ణు కనిపించబోతుండగా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్ వంటి తారలు కీలక పాత్రల్లో కనువిందు చేయబోతున్నారు.
ఇప్పటివరకూ పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించిన టీమ్ ఇప్పుడు చివరిదశకు చేరుకుంది. ఈరోజు హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ సెంటర్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్కు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, మోహన్ బాబు, కాజల్ తదితరులు హాజరుకానున్నారు.
అయితే ఈ సినిమాలో రుద్ర పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్ ఈవెంట్ కి వస్తాడా? రాడా? అనేదే అభిమానుల్లో ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ ఈవెంట్ కోసం ప్రభాస్ ని మోహన్ బాబు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని సమాచారం. ఆయన హాజరైతే సినిమాకు క్రేజ్ మరింత పెరుగుతుందన్నది వాస్తవం.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్లో ప్రభాస్ పాత్ర హైలైట్ అయ్యింది. సినిమాలోనూ అతని రోల్ కాస్త ఎక్కువ నిడివితోనే ఉంటుందని టీమ్ చెబుతుంది. మొత్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత 'కన్నప్ప'పై మరింత హైప్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.