‘కన్నప్ప‘ దర్శకుడి కథేంటి?

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘కన్నప్ప‘. తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.;

By :  S D R
Update: 2025-06-23 07:50 GMT

ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘కన్నప్ప‘. తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రచారాన్ని ఓ రేంజులో నిర్వహిస్తుంది టీమ్. పౌరాణిక గాథ ‘కన్నప్ప‘ ఆధారంగా ఈ చిత్రాన్ని ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు.

అసలు ఇప్పటివరకూ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ బయట పెద్దగా కనిపించలేదు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన హైలైట్ గా నిలిచారు. దీంతో.. ముకేష్ కుమార్ సింగ్ ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముకేష్ కుమార్ సింగ్‌ సినీ ప్రయాణం 2008లో ప్రారంభమైంది. కానీ ఆయన ఫుల్ టైమ్ డైరెక్టరుగా గుర్తింపు పొందింది బుల్లితెర ద్వారా కావడం విశేషం.

2012లో ప్రసారమైన 'రామాయణ్', 2013-14లో వచ్చిన 'మహాభారతం' వంటి మైథలాజికల్ సీరియల్స్ కు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. వీటితో పాటు ‘తెనాలి రామ, మేరే సాయి’ వంటి ప్రాజెక్ట్స్ కు వర్క్ చేశారాయన. మొత్తంగా.. ముకేష్ కుమార్ సింగ్ కు ఎక్కువగా పౌరాణిక గాథలను తెరకెక్కించిన అనుభవం ఉంది. అందుకే.. విష్ణు ఏరికోరి అతన్ని ‘కన్నప్ప‘కి దర్శకుడిగా ఎంచుకున్నాడు. మొత్తంగా ఇప్పటికే ప్రచార చిత్రాలతో అంచనాలు పెంచుకుంటున్న ‘కన్నప్ప‘ విడుదల తర్వాత ఎలాంటి ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News