‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరసాత్మక చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాండ్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది.;
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరసాత్మక చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాండ్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు హైలైట్గా నిలిచాయి. 'మోహన్ బాబు గారు డబ్బుకు విలువిచ్చే వ్యక్తి. అలాంటి ఆయన ఈ సినిమా కోసం రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ ఎందుకు పెట్టారు అనిపించింది. అది ఆయన ఆలోచన కాదు.. పరమేశ్వరుని సంకల్పమే అని నమ్ముతున్నా' అని అన్నారు. అలాగే ప్రభాస్ గురించి మాట్లాడుతూ – 'అతను డబ్బుకోసం కాదు, మానవతా విలువల కోసం ఈ సినిమాలో చేరారు. ఆయన శివభక్తి ఉన్న వ్యక్తి' అని కొనియాడారు.
ఇక ఈవెంట్లో నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ 'కన్నప్ప సినిమా కేవలం సినిమా కాదు, ఇది మన సంస్కృతిని, భక్తిని, హిందూ హెరిటేజ్ని ప్రతిబింబించే ప్రాజెక్ట్. సినిమా చూసే ముందు అభిప్రాయాలను రుద్దవద్దు. ప్రతీ ఒక్కరూ తమతమ సున్నిత అభిప్రాయాలతో ముందుకు రావాలి' అని సూచించారు.
హీరో మంచు విష్ణు మాట్లాడుతూ.. 'ప్రభాస్ నుంచి ఈ తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొంత డబ్బు వచ్చినా... కొంత పేరు వచ్చినా... చాలా మంది మారిపోతారు. కానీ మేమిద్దరం ఎలా కలిశామో… ఇప్పటికీ అలానే ఉన్నాం' అన్నారు. 'స్నేహితులు రెండు రకాలు.. కృష్ణుడు.. కర్ణుడు. నా జీవితంలో కృష్ణుడు ప్రభాస్' అని అన్నారు విష్ణు.
ఈ సందర్భంగా విడుదల చేసిన మేకింగ్ వీడియో విజువల్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మూవీలో ప్రభాస్ ఇంటర్వెల్ తర్వాత వస్తాడని రైటర్ బి.వి.ఎస్. రవి హింట్ ఇచ్చాడు. మొత్తంగా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ క్యాస్టింగ్తో రూపొందిన ‘కన్నప్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను సినిమా ఎలా అందుకుంటుందో చూడాల్సి ఉంది.