‘డ్రాగన్‘లో ‘యానిమల్‘ బ్యూటీ?
పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. హీరోలలోని మాస్ యాంగిల్ ను పీక్స్ లో చూపించే ప్రశాంత్ నీల్.. ఈ మూవీలో ఎన్టీఆర్ ను నెవర్ బిఫోర్ గా ఆవిష్కరించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది.;
పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. హీరోలలోని మాస్ యాంగిల్ ను పీక్స్ లో చూపించే ప్రశాంత్ నీల్.. ఈ మూవీలో ఎన్టీఆర్ ను నెవర్ బిఫోర్ గా ఆవిష్కరించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ‘కేజీఎఫ్, సలార్’ వంటి బ్లాక్ బస్టర్లు అందించిన ప్రశాంత్.. ఎన్టీఆర్ కెరీర్లో నిలిచిపోయే స్థాయిలో ‘డ్రాగన్‘ చిత్రాన్ని మలచేందుకు కసరత్తులు చేస్తున్నాడట.
ఈ చిత్రానికి ఇప్పటివరకూ టైటిల్ ప్రకటించకపోయినా ‘డ్రాగన్‘ టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఓ గ్రాండ్ సెటప్ని రెడీ చేశారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్గా నిలుస్తుందని టాక్. ఈ ఫైట్లో ఎన్టీఆర్తో పాటు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సహా మరికొంతమంది కీలక పాత్రధారులు పాల్గొంటున్నారని తెలుస్తోంది.
ఇకపోతే ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుందనే ప్రచారం ఉంది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. లేటెస్ట్ గా ఈ మూవీలో హీరోయిన్ గా ‘యానిమల్‘ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె లీడ్ రోల్లోనా? లేక సెకండ్ హీరోయిన్గానా? అన్నదానిపై
ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఆక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.