శ్రీకాకుళం జిల్లా పొలాల్లో పడిన 'తెల్ల మేఘం' – వైరల్ అవుతున్న అరుదైన దృశ్యాలు!

తెల్లటి మేఘంలా కనిపించే నురగ పదార్థం,భయం గుపిట్లో గ్రామస్థులు;

Update: 2025-06-27 06:58 GMT

శ్రీకాకుళం జిల్లాలో ఓ అరుదైన, రహస్యమైన ఘటన చోటు చేసుకుంది.ఆ జిల్లాలోని ఓ గ్రామంలోని పొలాల్లో తెల్లటి మేఘంలా కనిపించే నురగ పదార్థం కనిపించడం స్థానికులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది వాతావరణ పరిణామమా? ఆధ్యాత్మిక సంకేతమా? అనే చర్చ ఇప్పుడు ఉత్కంఠన పెంచుతోంది.

గత కొన్ని రోజులుగా వర్షం, గాలి వంటి వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, గ్రామస్థులు పొలాల్లో తెల్లటి నురగ వంటి పదార్థాన్ని గమనించారు.అది మేఘాన్ని తలపించేదిగా ఉండటంతో, “ఇది మేఘం భూమిపైకి పడిపోయిందా?” అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.ఈ దృశ్యాలను చూసిన గ్రామస్థులు హర్షం, భయం కలగలిపిన భావన వ్యక్తం చేస్తున్నారు.“ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు,ఇది ఏదో దేవుడి సంకేతమేమో అనిపిస్తోంది,” అంటున్నారు కొందరు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.అద్భుతంగా కనిపించే ఆ తెల్లటి పదార్థాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.“బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినదే కదా ఇది,” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.కొందరు దీనిని ప్రకృతిలో చోటు చేసుకుంటున్న రహస్యమైన మార్పులుగా అభివర్ణిస్తున్నారు.కొందరు వాతావరణ నిపుణుల ప్రకారం, ఇది ప్రాకృతిక రసాయనిక చర్యల వల్ల ఏర్పడే ‘ఎయిర్ ఫోమ్’ కావచ్చని చెబుతున్నారు.తక్కువ ఉష్ణోగ్రతలు, గాలిలో నష్టపడిన ద్రవ్యకణాలు కలిసి ఇలా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు.

ఇది నిజంగా మేఘమా? ప్రకృతి యొక్క ఆటలలో భాగమా? లేక భవిష్యత్తుకు సంకేతమా?ఈ ప్రశ్నలకు సమాధానాలకోసం అధికారులు, శాస్త్రవేత్తలు ఇంకా పరిశీలన జరుపుతున్నారు. కానీ ప్రజల ఊహాగానాలకు మాత్రం ఆపు లేదు. శ్రీకాకుళం పొలాల్లో పడిన ఈ తెల్లటి మేఘం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News