సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఖాతాలో మరో రెండు విజయాలు
పీఎం నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పై ప్రశంశల వర్షం;
11 అంతర్జాతీయ యోగదినోత్సవం సందర్భంగా యోగాంధ్రలో భాగంగా విశాఖపట్నం లో యోగాసనాల్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల సీఎం చంద్రబాబునాయుడు పాలనలో మరో రెండు విజయాలు వచ్చి చేరాయి.
యోగాంధ్ర లో భాగంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో అల్లూరి జిల్లాకు చెందిన 22 ,122 గిరిజన విద్యార్థులు నిర్వహించిన సూర్యనమస్కారాలు కొత్త గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు సాధించింది.45 రోజులుగా నారా లోకేష్ చేసిన ప్రయత్నాన్ని పీఎం నరేంద్రమోడీ ప్రశంసించారు.
విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం లో ౩.1 లక్షల మంది పాల్గొనడం మరో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది.ఇలా ఒకేరోజు వరుసగా రెండు గిన్నిస్ బుక్ అవార్డులు రావటం సీఎం చంద్రబాబు కొనియాడారు.ఈ రోజు విశాఖలో గిన్నిస్ బుక్ అధినేతలు మంత్రులు నారా లోకేష్,సత్య కుమార్ గార్లకు ఈ రికార్డ్ ను అందించారు.
అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా రాష్టప్రజల అందర్నీ ఒకచోటికి చేర్చిన సీఎం చంద్రబాబు ,లోకేష్ పై మోడీ ప్రశంసలవర్షం కురిపించారు.యోగ తో ఆరోగ్యమే కాదు క్రమశిక్షణ కూడా వస్తుందిఅన్నారు,యోగాను క్రీడల్లో భాగం చేయాలి
అని,2037 లో యోగాకు స్వర్ణద్రప్రదేశ్ లో భాగం కలిపిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు .