కూలిన ఎయిర్ ఇండియా విమాన బ్లాక్ బాక్స్ పై ఊహాగానాలు

బ్లాక్ బాక్స్ లో ఏముందో డీకోడ్ చేయడానికి టైం పడుతుంది అన్న కేంద్రమంత్రి;

Update: 2025-06-24 12:11 GMT

ఇటీవల ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోవటం యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.ఈ నెల జూన్ 13 ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన కొన్ని నిమషాలలోనే ఒక వైద్యశాల వసతి గృహంపై పడటం విషాదానికి గురి చేసింది.ఈ ఘటనలో 240 మంది ప్రయాణికులతో పటు మొత్తం 270 మంది చనిపోయారు.

ఇప్పుడు విమానం కూలిపోవడానికి గల కారణాలను విశ్లేస్తున్నారు.కారణాలు తెలియాలి అంటే విమానం లో ఉండే బ్లాక్ బాక్స్ మీదే అందరి ద్రుష్టి ఉంది.అసలు విమానం కూలిపోక ముందు ఏమి జరిగింది అని తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ అనే చిన్న పరికరం ద్వారానే తెలుసుకోగలం.విమానం కూలిన ప్రదేశం నుంచి అధికారులు బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్నారు.ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ విదేశాలకు పంపించారు అనే ఊహాగానాలు వినబడుతూనే.

కానీ విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విష్యాన్ని ఖండించారు,కేంద్ర విమానయాన సంయుక్త అద్వర్యంలో పుణేలో జరిగిన హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్ 2025 సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.బ్లాక్ బాక్స్ విదేశాలకు పంపించాం అనేది కేవలం ఊహాగానాలే అన్నారు,బ్లాక్ బాక్స్ భారత్ లోనే ఉంది అని.ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తుంది అని స్పష్టం చేసారు.బ్లాక్ బాక్స్ లో ఉన్న విషయాలు తెలుసుకోడానికి ఇంకా టైం పడుతుంది అన్నారు.డీకోడ్ ద్వారానే తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి ఏఏఐబి నిశితంగా పరిశీలించి నివేదిక ఇస్తుంది అన్నారు.

Tags:    

Similar News