సనాతనధర్మ పరిరక్షణకు నేనున్నాను అంటున్న పవన్
పవన్ మధురై ప్రసంగంలో సూడో సెక్యూలరిస్టులను ఏకిపారేశారు;
జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతనధర్మ పరిరక్షణ భాద్యత తన భుజంమీద వేసుకున్నారు.సెక్యూలరిజం పేరుతో హిందూ మతాన్ని తక్కువ చేసే వాళ్ల మీద ఘాటుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే,తమిళనాడులోని మధురైలో నిర్వహిస్తున్న మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న పవన్ తన ఘాటైన ప్రసంగంతో ప్రజలను ఉర్రుతలూగించారు.
తమిళనాడు బీజీపీ అగ్ర నేత అన్నామళైతో పాటు చాలామంది స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పవన్ ప్రసంగంలో హిందూమతం అనేది కొన్ని వేల సంవత్సరాల నాటిదని, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటున్నారు, కానీ మన మతాన్ని మనం గౌరవించుకోలేకపోతున్నాము అని ఘాటుగా స్పందించారు.ఎవరైనా మన మతాన్ని ,మనం పాటిస్తున్న సనాతనధర్మాన్ని అగౌరవ పరిస్తే మనం కూడా తిరగపడాలి అన్నారు.
ఎవరి మతాన్ని అయినా కించపరిచే అధికారం ఎవరకి లేదు అని, కానీ ఇక్కడ ఆలా లేదు అని ఏ మతం వారు అయినా మన గురించి తప్పుగా మాట్లాడవచ్చు కానీ మనం ఒకమాట అంటే మాత్రం దాని సెక్యూలిజం అంటున్నారు. సెక్యూలిజం అంటే అన్నిమతాలను గౌరవించడం అని పవన్ అన్నారు.ఇతర మతాల దేవుళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం వారికి ఉందా అని పవన్ ప్రశ్నించాడు
మన హిందూ దేవుళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడితే మా మనోగతాలు దెబ్బతిన్నాయి అని ధర్నాలు చేస్తున్నారు.హిందూమతానికి ,మన సనాతన ధర్మ సంప్రదాయాన్ని ఏవరైనా విమర్సిస్తే మనం కూడా తిరగబడే చైతన్యం మన అందరి లో కలగాలి అని అన్నారు.