బైక్స్ కూడా ఫాస్ట్ టాగ్ అవసరమా.. హైవే ఎక్కితే టోల్ కట్టాల్సిందేనా
జులై నెలతో ముగుస్తున్న గడువు...టోల్ టాక్స్ కంపల్సరీ అంటున్న కేంద్రం;
By : Dasari Suresh
Update: 2025-06-26 12:10 GMT
భారతదేశంలో ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారి పై ప్రయాణించిన ఇప్పటి వరకు టోల్ కట్టవలసిన పని ఉండేదికాదు. 15, 2025 నుండి, జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు ముగియబోతోందని NHAI మరియు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నుంచి హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ చెల్లించే అవసరం ఏర్పడుతుంది.ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు టోల్ చెల్లించాలి అని అధికారిక ప్రకటన వస్తే,వీటికి కూడా ఫాస్ట్ టాగ్ వేయించుకోక తప్పదు.