నేడు డిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Update: 2025-05-29 03:34 GMT

మహానాడు బహిరంగ సభ అనంతరం కడప నుంచి నేరుగా డిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

రేపు సాయంత్రం డిల్లీలో జరిగే సీఐఐ ఏజీఎం సమావేశంలో పాల్గొననున్న సీఎం

రేపు రాత్రికి డిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు

31వ తేదీన డీల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ముమ్మిడివరం నియోజకవర్గo గుంనేపల్లిలో పేదలకు ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్న సీఎం

జూన్ 1వ తేదీ ఆదివారం కావటం తో ఒక రోజు ముందే ఫించన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం

గున్నేపల్లి గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం

నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమై సాయంత్రం అమరావతి చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Tags:    

Similar News