బిఆర్ఎస్ బీజేపీ లో విలీనం....జోస్యం చెప్పిన బీజేపీ ఎంపీ అరవింద్
బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు,కెసిఆర్ పోటీచేయరు అంటున్న బీజేపీ నేతలు;
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నుంచి సిద్ధిపేట కేంద్రంగా హరీష్ రావు ఒక్కరే ఎన్నికవుతారని, వయస్సు రీత్యా, కేసీఆర్ కు ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేసీఆర్ రాబోయే ఎన్నికల నాటికీ రాజకీయాల నుంచి నిష్క్రమించవచ్చు అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసారు బీజేపీ ఎంపీ అరవింద్.తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని అరవింద్ జోస్యం చెప్పడం మొదలు పెట్టారు.
బిఆర్ఎస్ పార్టీ సిద్ధిపేట నుంచి కేవలం హరీష్ రావు మాత్రమే గెలుపొందుతారు అని చెప్పారు.బిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షడు కేటిర్ తో పాటు మిగతా నాయకులు కూడా ఓడిపోతున్నారు అని బిఆర్ఎస్ భవిష్యత్తు పై జాతకం చెప్పారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారాన్ని చేపడుతుంది అని తెలియచేసారు.
బిఆర్ఎస్ ను బీజేపీ లో కాలపడానికి హరీష్ రావు ప్రయత్నిస్తునట్టు తెలుస్తుంది.ఇటీవలే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీని నాశనం చేయడానికి సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారు అని చేసిన సంచలన వ్యాఖలు,బిఆర్ఎస్ నాయకులను ఉల్లిక్కి పడేలా చేసింది.ఎమ్మెల్సీ కవిత పరోక్షంగానే హరీష్ రావుని అన్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ లో చేర్చ నడుస్తుంది.
అయితే ఇటీవల కేటిర్ ఫోన్ టాపింగ్ కేసు, హరీష్ రావు ,కెసిఆర్ కాళేశ్వరం పంచాయతీ ఒక కొలిక్కి రావాలి అంటే బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవటం తప్ప ఇంకో ప్రచామన్నాయం కనిపించటం లేదు.హరీష్ రావు దీనికి ముఖ్య వ్యక్తిగా వ్యవహరిస్తున్నట్టు బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తుంది.ఇవ్వని చూస్తే ఎంపీ అరవింద్ మాటలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ తో కలిసి పోటీచేస్తుందా లేదా పార్టీని విలీనం చేసి నాయకులు బీజేపీ తరుపున పోటీ చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.