ఆంధ్రప్రదేశ్ ను మోడీ మోసం చేసారు అంటున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల

యోగ మీద ఉన్న ప్రేమ ఏపీ ప్రజలపై ఉందా అని ప్రశించారు;

Update: 2025-06-26 17:36 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల రెడ్డి ఈ రోజు విజయవాడ లో మాట్లాడుతూ,రాష్ట్ర రాజకీయాలు దారుణంగా మారిపోయాయి అన్నారు.ఉన్న పార్టీలన్నీ మోడీ తొత్తులుగా తయారుయై ఎవరూ ప్రజల భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు అని అందరూ మోడీ జపమే చేస్తున్నారు అని దుయ్యపట్టారు.మోడీ గారికి యోగా మీద ఉన్న ప్రేమ,ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉందా? అని ప్రశ్నించారు.

యోగా చేసి తృప్తిగా ఉంది అన్నారు కానీ ఒక్క హామీ అయినా నెరవేర్చారా?ఒక్క ప్రకటన అయినా చేసేరా , మా రాష్ట్రానికి మేలు జరిగేలా?ప్రత్యేక హోదా మోసం చేశారు,“ఢిల్లీని మించే రాజధాని” అని చెప్పి నిధులు కాకుండా అప్పులు ఇచ్చారు,పోలవరం ఎత్తు తగ్గించి మోసం చేశారు.రాష్ట్ర యువతకు ఉద్యోగం లేదు,ఇవన్ని చూసినా బాబు, పవన్, జగన్ ఎవ్వరూ బీజేపీని ప్రశ్నించలేదు.వారంతా బీజేపీకి ఊడిగం చేస్తున్నారు అని విమర్శించారు.

జగన్ చేసినది అక్రమ పొత్తు.ప్రజా సమస్యల గురించి మాట్లాడే హక్కు జగన్‌కి లేదు.ఐదేళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించాడు అని షర్మిల మాట్లాడారు.రైతులను విస్మరించి , నష్టాల్లో మునిగిపోయినా పట్టించుకోలేదు.YSR ప్రారంభించిన జలయజ్ఞాన్ని కొనసాగించలేదు.“ఆరు నెలల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి” అన్నాడు ఒక్కదానిని కూడా పూర్తిచేయలేదు.ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కానీ ఇప్పుడు “జగన్ 2.0” అంటున్నారు.ప్రజలను మాయ చేయాలనుకుంటున్నారు.జగన్‌కి ప్రజా సమస్యలు ముఖ్యం కాదు బల ప్రదర్శనలు కావాలి.అందుకే పర్యటనల పేరుతో తన శక్తిని చూపిస్తున్నాడు.ఆ ప్రదర్శనల వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు అని అన్నారు.

బాబాయిని చంపి, బాబాయ్ కూతురు సునీత మీద నింద వేయడం న్యాయమా అని ప్రశ్నించారు, ఇప్పుడు సింగయ్య మరణాన్ని “AI” అంటున్నారు,ఇది ఎంత దుర్మార్గం? వివేకా హత్య కేసులో CBI అన్ని ఆధారాలు చూపించింది.

హత్య చేసినవాళ్లతో సంభాషణలు ఉన్నాయని చెప్పింది,అయినా "మేము కాదు… మాకు తెలియదు" అంటున్నారు అని వైసీపీపై విమర్శనా హాస్త్రాలు గుప్పించారు.మాట మార్చడం, తప్పుదారి పట్టించడం ఇవే ఈనాటి పాలకుల శైలి అంటూ అధికార ,ప్రతిపక్షాలను విమర్శించారు

Tags:    

Similar News