12 రోజుల భక్తి యాత్రకు శ్రీకారం – రథాలపై జగన్నాధుని విగ్రహాల దర్శనం

దేశంలోనే అత్యంత గొప్ప రథయాత్రకు శ్రీకారం – లక్షలాది భక్తుల సమాగమానికి పూరి సిద్ధం;

Update: 2025-06-27 09:48 GMT

భారతదేశంలో జరిగే అత్యంత గొప్ప రథయాత్ర పూరి జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి ఈ యాత్రను చూడటానికి తరలివస్తారు. ఈ సంవత్సరం జూన్ 27, శుక్రవారం నాడు ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది.ఒడిశాలోని పూరి — హిందువుల "చార్ ధామ్"లలో ఒకటి. భువనేశ్వర్‌కి సుమారు 60 కిమీ దూరంలో ఉంది పూరీ. ఈ క్షేత్రంలో జరిగే ఉత్సవాల్లో జగన్నాథ రథయాత్ర అతి ప్రాముఖ్యత కలిగినది.

12 రోజుల పాటు (ఆషాఢ శుద్ధ విదియ నుండి) మూలవిరాట్లు స్వయంగా రథాలలో భక్తులకు దర్శనం ఇస్తారు ఇదే ఈ యాత్ర ప్రత్యేకత.ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు,వాటికి నందిఘోష, తాళధ్వజం, పద్మధ్వజం అని రథాలకు పేర్లు పెడతారు.1072 వృక్ష భాగాలను ఉపయోగించి 2188 ముక్కలుగా కట్టెలు తయారుచేస్తారు.అక్షయ తృతీయన మొదలయ్యే ఈ నిర్మాణంలో 9 శిల్పులు, 125 మంది సహాయకులు పాల్గొంటారు.

ఈ రధోత్సవం లో ముందుగా విగ్రహాలను ఆలయం నుంచి రథాలపై ప్రతిష్ఠించే కార్యక్రమం చేస్తారు తరువాత స్వామివారి ఊరేగింపు ముందుగా గంధ జలాలతో శుభప్రదక్షిణ గావిస్తారు.అప్పుడు పూరి జగన్నాధుడి రధ శోభ ప్రరారంభం అవుతుంది.పూరీ రాజు స్వయంగా బంగారు చీపురుతో రథం ముందు నేల శుభ్రం చేస్తాడు,రథ చక్రాలు ఏ ఒక్క పరిస్థితిలోనూ వెనక్కి తిరగవు. ఇది భక్తుల నమ్మకానికి చిహ్నం.

జగన్నాథుడి రథం మూడు మైళ్ల దూరంలోని గుండీచా ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ వారం రోజుల పాటు స్వామివారు విశ్రాంతి తీసుకొని, తిరిగి ఆలయానికి తిరిగి వస్తారు. ఈ తిరుగు ప్రయాణం "బహుదా యాత్ర"గా పిలుస్తారు.ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు స్వామివారిని బంగారు ఆభరణాలతో అలంకరించడంతో యాత్ర ముగుస్తుంది. ఆలయం మళ్లీ తన శోభను అందుకుంటుంది.జగన్నాథుని రథయాత్రను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని భావిస్తారు,ఒక్కసారైనా ఈ మహా యాత్రను ప్రత్యక్షంగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటారు.

Tags:    

Similar News