సీనియర్ నిర్మాత కావూరి మహేంద్ర కన్నుమూత
చెన్నైలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో గీతా ఆర్ట్స్ పిక్చర్స్, ఎ.ఎ.ఆర్ట్స్ బ్యానర్లపై 50కి పైగా చిత్రాలను నిర్మించారు.;
సీనియర్ సినీ నిర్మాత కావూరి మహేంద్ర (79) గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత అర్ధరాత్రి కన్నుమూశారు. చెన్నైలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో గీతా ఆర్ట్స్ పిక్చర్స్, ఎ.ఎ.ఆర్ట్స్ బ్యానర్లపై 50కి పైగా చిత్రాలను నిర్మించారు. సినీ పరిశ్రమ హైదరాబాద్కు మారిన తర్వాత ఎ.ఎ.ఆర్ట్స్ బ్యానర్పై శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన ఘనత ఆయనది. అలాగే, ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేనిని దర్శకత్వ శాఖలో పరిచయం చేసిన వ్యక్తిగా కావూరి మహేంద్ర గుర్తింపు పొందారు.
కావూరి మహేంద్ర నటుడు, నిర్మాత అయిన డాక్టర్ మాదాల రవికి మామగారు. ఆయన నిర్మించిన చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో గణనీయమైన ముద్ర వేశాయి. ఆయన అంత్యక్రియలు నేడు గుంటూరులోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 12:30 గంటలకు జరగనున్నాయి. కావూరి మహేంద్ర మరణం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.