మల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్ గా కత్రినా కైఫ్
పర్యాటక రంగాన్ని మరింత బూస్ట్ చేసేందుకు ‘విజిట్ మాల్దీవ్స్’ అనే క్యాంపెయిన్ని ఇటీవల లాంఛ్ చేసిన సందర్భంగా, కత్రినా కైఫ్ను ఈ కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్లు సంస్థ వెల్లడించింది.;
బాలీవుడ్ స్టార్ నటి కత్రినా కైఫ్ను మాల్దీవులు తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. ఈ సంగతిని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ మంగళవారం ఓ అధికారిక ప్రకటనలో బయటపెట్టింది. పర్యాటక రంగాన్ని మరింత బూస్ట్ చేసేందుకు ‘విజిట్ మాల్దీవ్స్’ అనే క్యాంపెయిన్ని ఇటీవల లాంఛ్ చేసిన సందర్భంగా, కత్రినా కైఫ్ను ఈ కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ సమ్మర్ సేల్ ప్రచారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ అవకాశంపై కత్రినా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. “మాల్దీవుల సహజ సౌందర్యానికి ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణం. ఇక్కడి నీలి సముద్రాలు, పచ్చని ద్వీపాలు, ప్రశాంత వైబ్... ఇవన్నీ టూరిస్టులకు ఓ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. మాల్దీవులను ప్రపంచానికి మరింత చేరువ చేయడానికి నా వంతు కంట్రిబ్యూషన్ అందిస్తా. ఈ బ్రాండ్ అంబాసిడర్ రోల్ నాకు చాలా స్పెషల్” అని కత్రినా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
2023 లో భారత్తో దౌత్యపరమైన గొడవల కారణంగా మాల్దీవుల పర్యాటక రంగం సీరియస్గా దెబ్బతిన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటివరకూ మాల్దీవులకు టాప్ టూరిస్ట్ సోర్స్గా ఉన్న భారత్, 2024 నాటికి ఆరో స్థానానికి డ్రాప్ అయింది. ఈ బ్యాక్డ్రాప్లో, భారతీయ టూరిస్టులను తిరిగి ఆకర్షించేందుకు మాల్దీవులు ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వెళ్లాయి. ఈ స్ట్రాటజీలో భాగంగానే బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ను అంబాసిడర్గా ఎంచుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో మాల్దీవులను విజిట్ చేయనున్నారు, ఇది రెండు దేశాల మధ్య రిలేషన్స్ను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.