విజయ్-దిల్ రాజు సినిమా ముహూర్తం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాని ప్రారంభించాడు. చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన రవికిరణ్ కోలా మూవీ ముహూర్తాన్ని జరుపుకుంది. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 59వ చిత్రంగా నిర్మిస్తున్నారు. శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ‘మహానటి‘ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండటం విశేషం. ‘మహానటి‘ సినిమాలో కలిసి సందడి చేయకపోయినా.. ఈసారి మాత్రం పెయిర్ గా కనిపించబోతున్నారు విజయ్-కీర్తి. ఈ సినిమా ముహూర్తానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఎ వైల్డ్ బిగినింగ్.. లవ్, రేజ్, బ్లడ్‘ అంటూ ఈ మూవీ అవుట్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్నట్టు చెప్పకనే చెప్పారు మేకర్స్. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ మూవీకి ‘రౌడీ జనార్థన్‘ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
A Wild Beginning.. 🔥
— Sri Venkateswara Creations (@SVC_official) October 11, 2025
LOVE - RAGE - BLOOD ❤️🔥
The most anticipated @TheDeverakonda x @storytellerkola's #SVC59 has began today with an auspicious Pooja Ceremony.#VDKolaMassThaandavam Begins.. 💥@KeerthyOfficial #AnendCChandran@DinoShankar @PraveenRaja_Off @SVC_official pic.twitter.com/LkTb6lsliK
-
Home
-
Menu