'డ్రాగన్' స్క్రిప్టులో మేజర్ ఛేంజెస్?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘డ్రాగన్’. 'కెజిఎఫ్, సలార్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీలోని ఓ పాటను చిత్రీకరించారట. ఈ పాట సినిమాలోని థీమ్కు బలం చేకూర్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాక, ఈ పాటలోని ఎన్టీఆర్ స్టెప్స్, డాన్స్ లోని ఎనర్జీ ఫ్యాన్స్కు స్పెషల్ ట్రీట్ అందిస్తాయని చెబుతున్నారు.
ఇక ‘డ్రాగన్’ స్క్రిప్ట్ విషయంలో ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. సాధారణంగా స్క్రిప్ట్ ఫిక్స్ అయిన తర్వాత మార్పులు చేయడానికి ఒప్పుకోడు ప్రశాంత్ నీల్. కానీ.. ఎన్టీఆర్ సలహాల మేరకు కథలో చిన్నపాటి మార్పులు చేస్తున్నాడని సమాచారం. షూటింగ్ మధ్యలో కూడా స్క్రిప్ట్ను ఫైన్ట్యూన్ చేస్తున్నాడట.
ప్రశాంత్ నీల్ మార్క్ ఫైట్స్ తో పాటు.. ఎన్టీఆర్ మార్క్ సాంగ్స్ కూడా ఈ చిత్రానికి హైలైట్ అవుతాయంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా.. ఓ స్పెషల్ సాంగ్ లో రష్మిక నర్తించనుందట. 2026 జూన్ 25న వరల్డ్ వైడ్గా 'డ్రాగన్' రిలీజ్ కు రెడీ అవుతుంది.
-
Home
-
Menu