వివాదానికి తెరదించిన దిల్ రాజు

వివాదానికి తెరదించిన దిల్ రాజు
X
గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో చర్చకు కేంద్ర బిందువైన ఎగ్జిబిటర్ల వివాదానికి నిర్మాత దిల్ రాజు ఇచ్చిన ప్రకటనతో ఎట్టకేలకు ముగింపు పలికింది.

గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో చర్చకు కేంద్ర బిందువైన ఎగ్జిబిటర్ల వివాదానికి నిర్మాత దిల్ రాజు ఇచ్చిన ప్రకటనతో ఎట్టకేలకు ముగింపు పలికింది. 9 రోజులుగా కొనసాగుతున్న ఈ సమస్యపై ఆయన సమగ్రంగా స్పందించారు. ముఖ్యంగా కందుల దుర్గేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామనగా, తానే వారించానని, దుర్గేష్ ఫోన్ చేసినప్పుడు సానుకూలంగా స్పందించి థియేటర్లు మూసే అవసరం లేదని స్పష్టంగా చెప్పినట్టు వివరించారు. ఈ సందర్భంగా మీడియా కొన్ని విషయాలను తప్పుడు కోణంలో ప్రజలకు అందించిందని, ఛాంబర్ మీటింగ్‌లో ఏమి జరిగిందో బయటకు రావకుండా బ్రేకింగ్స్ వచ్చాయని దిల్ రాజు వెల్లడించారు.

ఎగ్జిబిటర్ల వివాదం గురించి దిల్ రాజు స్పందిస్తూ.. ‘అసలు ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లోని ఎగ్జిబిటర్లతో వివాదం ప్రారంభమైంది. రాష్ట్రంలో అధిక శాతం సినిమాలు పర్సంటేజ్ విధానంలో ప్రదర్శింపబడుతున్నప్పటికీ, ఎగ్జిబిటర్లు మాత్రం రెంటల్ విధానానికి ఒప్పుకోవడాన్ని నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26న గిల్డ్ మీటింగ్ జరిగిందని‘ తెలిపారు.

నైజాంలో 370 థియేటర్లలో, తమ వద్ద (దిల్ రాజు) 30, ఏషియన్, సురేష్ వద్ద 90 థియేటర్లున్నాయని, మిగిలినవి ఇతర ఓనర్ల వద్ద ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఎగ్జిబిటర్లతో 20 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో తమకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉందని, అక్కడ 20 థియేటర్లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు ముఖ్యమని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించడంతో సినీ పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలన్న ఆలోచన ఉన్నట్లు తెలిపారు. టికెట్ ధరలపై కళ్యాణ్ గారి వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు పేపర్ పట్టుకొని ధరలు పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Tags

Next Story