తనయుడి కోసం కలిసిన ధనుష్-ఐశ్వర్య!

మాజీ భార్యభర్తలు ధనుష్-ఐశ్వర్య తల్లిదండ్రులుగా ఎంతో గర్వంగా ఉన్నారు. తమ కుమారుడు యాత్ర స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా, తల్లిదండ్రులిద్దరూ కలిసి వేడుకలో పాల్గొన్నారు. ఈ సంబరాల సందర్భంలో వారు తమ కొడుకును కౌగిలించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ధనుష్ ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ 'ప్రౌడ్ పేరెంట్స్' అనే వ్యాఖ్యను జతచేశారు. విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఒక స్టేజ్ మీద కలిసిన ఈ జంటను చూసిన నెటిజన్లు ఎమోషనల్గా స్పందిస్తున్నారు. 'మళ్లీ కలిస్తే బాగుంటుంది' అనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్యతో 2004లో వివాహం చేసుకున్న ధనుష్, 18 ఏళ్ల అనంతరం విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులపై కోలీవుడ్లో రకరకాల వార్తలు వచ్చినా, వీరు తల్లిదండ్రులుగా మాత్రం కలిసి తమ పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
యాత్ర గ్రాడ్యుయేషన్ సెరమనీని, తాత రజనీకాంత్ కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ధనుష్-ఐశ్వర్య తమ కుమారుడిని హత్తుకున్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు తలైవా.
First milestone crossed my lovable grandson 💐 congratulations yathra kanna ! ❤️❤️ pic.twitter.com/D15JexNw4g
— Rajinikanth (@rajinikanth) May 31, 2025
-
Home
-
Menu