'కూలీ' కోసం క్రేజీ డీల్!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'కూలీ'. ఈ సినిమాలో అగ్రతారలు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తుండటంతో కాస్ట్ పరంగా స్పెషల్ అట్రాక్షన్గా మారింది.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం పోటీ తీవ్రంగా నడిచింది. నాగార్జున స్వయంగా అన్నపూర్ణ బ్యానర్ ద్వారా ఈ సినిమా పంపిణీ చేయాలని ఉత్సాహం చూపించగా, సన్ పిక్చర్స్తో బలమైన అనుబంధం ఉన్న సునీల్ నారంగ్, ఆయనతో కలిసి సురేష్ బాబు – దిల్ రాజు లాంటి నిర్మాతలు కూడా రేసులో ఉండటం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే ఈ రేసులో నాగవంశీ రంగంలోకి దిగి రూ.44 కోట్ల ఆఫర్ ఇవ్వడం వల్ల డీల్ మరింత గట్టిగా మారిందని తెలుస్తోంది. మొత్తంగా ఈ మూవీ తెలుగు హక్కులను రూ.44 నుంచి రూ.48 కోట్ల మధ్యలో సునీల్ నారంగ్-సురేష్ బాబు సొంతం చేసుకున్నారని వినిపిస్తుంది. ఒక తమిళ చిత్రానికి తెలుగులో ఈ రేంజ్ రేటు రావడం అంటే మామూలు విషయం కాదు.
ఇప్పటికే 'కూలీ' ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.500 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. తెలుగు రైట్స్ (రూ.48 కోట్లు), ఓవర్సీస్ రైట్స్ (రూ.75-90 కోట్లు), ఓటీటీ రైట్స్ (రూ.120 కోట్లు), మరియు ఇతర భాషల రైట్స్ (తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ) లకు భారీ డీల్స్ వచ్చాయట.
మరోవైపు 'కూలీ' హిందీ టైటిల్ ను 'మజదూర్'గా ఫిక్స్ చేశారు. గతంలో హిందీలో అమితాబ్ బచ్చన్ 'కూలీ' అనే సినిమా చేసి ఉండటంతో ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారట. అయితే 'కూలీ' హిందీ టైటిల్ కి నెటిజన్ల నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది.
-
Home
-
Menu