చిరంజీవి-బాబీ కన్ఫమ్!

చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నాడు చిరు. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదలకు ముస్తాబు చేస్తారు. అయితే.. అనిల్ రావిపూడి తర్వాత శ్రీకాంత్ ఓదెల లైన్లో ఉన్నా.. చిరు మాత్రం మరో డైరెక్టర్ తో మూవీని పట్టాలెక్కించే సన్నాహాల్లో ఉన్నాడట. అతనే బాబీ.
మెగాస్టార్ మరోసారి బాబీతో చేతులు కలపబోతున్నట్టు స్పష్టమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు మళ్లీ అదే మేజిక్ రిపీట్ చేయాలన్న సంకల్పంతో ఈ కాంబినేషన్ పని చేస్తుందట. రచయిత కోన వెంకట్ ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. కథతో పాటు స్క్రీన్ ప్లేను కూడా తానే సమకూరుస్తున్నట్టు చెప్పాడు.
మరోవైపు శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్'తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది. అంటే.. అప్పటికే అనిల్ సినిమాని కంప్లీట్ చేసి బాబీ సినిమాని దాదాపు పూర్తి చేస్తాడు చిరంజీవి. బాబీ చిత్రం తర్వాతే శ్రీకాంత్ ఓదెల సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట మెగాస్టార్.
-
Home
-
Menu